₹30 కోట్ల ఆస్తి ఇచ్చినా తల్లికి తిండి పెట్టని కొడుకులు💔

శంకర్పల్లిలో హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 82 ఏళ్ల సుశీలమ్మ తన ఇద్దరు కొడుకులకు ₹30 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని సమానంగా పంచింది. తన ఫ్యూచర్ కోసం 2 ఎకరాలు అమ్మి దాచుకున్న ₹2.70 కోట్ల క్యాష్ను చిన్న కొడుకు నర్సింహారెడ్డి లాక్కున్నాడు. కనీసం అన్నం పెట్టకుండా, కేవలం బ్రెడ్ ఇస్తూ డాబా పైన ఉంచాడు. డబ్బులు తిరిగి అడిగితే ఇంట్లోంచి గెంటేశాడు. తిండికి అలమటిస్తూ ఆ బామ్మ 6 నెలలుగా ఆర్డీవో, కలెక్టర్ చుట్టూ తిరుగుతుండగా, ఫైనల్గా పోలీసులు కేసు బుక్ చేశారు.



