← Back to news

పాకిస్తాన్ లో సూసైడ్ బాంబింగ్!

By Subhash· 25 May 2026· Wikipedia· Pakistan

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. క్వెట్టాలో సైనికులతో వెళ్తున్న రైలుపై సూసైడ్ కారు బాంబు దాడి జరగడంతో కనీసం 24 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దారుణానికి బాధ్యత వహించింది. గాయాలైన వాళ్ళని ఆస్పత్రులకు తరలించగా, చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.