అందరం కలిసికట్టుగా పోరాడాలి

TG: హిందూ మతంలో సంస్కరణ తీసుకురావాలని పోరాడే ‘విజయవిహారం’ రమణమూర్తిపై దాడి చేయడం బాధాకరమని సామాజికవేత్తలు, మేధావులు అన్నారు. రమణమూర్తిపై హిందూత్వ ఉన్మాది దాడి ఘటనకు ఖండనగా హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో సామాజికవేత్తలు, కళాకారులు, మేధావులు మాట్లాడుతూ భౌతిక దాడి చేసే శక్తులపై రమణమూర్తితో కలిసి అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.



