కారులో మంటలు.. క్షణాల్లో బతికి బయటపడ్డ ఏడుగురు

TG: ఖమ్మం - దేవరపల్లి నేషనల్ హైవేపై వేంసూరు వద్ద కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి అన్నవరం వెళ్తోన్న కారు ముందు టైరు పేలి రెయిలింగ్ను ఢీకొట్టింది. లింగంపాలెం ఎగ్జిట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఏడుగురు స్వల్ప గాయాలతో భయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.



