← Back to news

429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం

By DK· 16 Jul 2026· మెదక్ జిల్లా
429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం

TG: ధరణి పోర్టల్‌లో సాఫ్ట్‌వేర్ లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్య హక్కులు మార్చినట్లు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో 429ఎకరాల ఇనాం భూములను మాయం చేశారు. ఈ భూములపై పలువురు తమకు హక్కులు ఉన్నాయని రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకోవడం, కోర్టులో కేసులు వేశారు. అదే అదనుగా కొందరు మెదక్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, RDOలు, తహీసీల్దార్‌లతో కుమ్మక్కై ఈ భూములను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిట్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

More in TG