తెలంగాణ కోసం ఒక్కటవ్వాలి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగాలని CM రేవంత్రెడ్డి MPలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20నుంచి ప్రారంభం కానుండడంతో కేంద్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై MPలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటుచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలికవసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులపై పార్లమెంట్లో గళమెత్తాలన్నారు. అన్ని పార్టీల ఎంపీలతో కలిసి ముందుకెళ్లాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సూచించారు.



