← Back to news

తహసీల్దార్ ఆఫీస్‌లో క్షుద్రపూజలు కలకలం

By DK· 9 Jul 2026· జగిత్యాల జిల్లా
తహసీల్దార్ ఆఫీస్‌లో క్షుద్రపూజలు కలకలం

TG: జగిత్యాల జిల్లా రాయికల్ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు, GPOలు తరచు వాహన ప్రమాదాలకు గురవుతున్నారు. బదిలీపై వచ్చి కార్యాలయంలో అడుగుపెట్టగానే ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు GPOలు ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో రెవెన్యూ అధికారులకు భయం పట్టుకుంది. విషయం బయటకు పొక్కకుండా CC కెమెరాలను ఆఫ్ చేయించారు. కార్యాలయం ఎదుట క్షుద్రపూజలు చేయించారు. గుంత తవ్వి గొర్రెను బలి ఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. మల్లాపూర్ మండలం VV రావుపేటలోని గంగ వద్ద విందు భోజనాలు కూడా చేసినట్లు సమాచారం.

More in TG