కరీంనగర్లో పీఎంజే జ్యుయెలరీ షాప్ లో భారీ దోపిడీ !
కరీంనగర్ లోని పట్టణంలోని పీ ఎం జే జ్యువెలరీ షాపులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది...పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు..! నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై డీజీపీ సివి ఆనంద్ ఆరా తీశారు.నగరాన్ని అష్ట దిగ్బంధనం చేసి గాలిస్తున్నారు.



