వైరల్గా మారిన అధికారి వసూళ్ల డైరీ

TG: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన నిజామాబాద్ ఎక్సైజ్శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నెలవారి మామూళ్ల చిట్టాను చూసి ACB అధికారులు షాక్ అయ్యారు. నిజామాబాద్ కల్లు దుకాణం రూ.15వేల మామూలును 20వేలకు పెంచారని, బోర్గం కల్లు దుకాణం మామూలు రూ.5వేల నుంచి రూ.12వేలకు పెంచారని ఇలా అనేక కల్లుడిపోల నుంచి నెలవారీ మామూళ్లను ఆయన సేకరించారని పేర్కొన్నారు. కల్లు డిపోలు, వైన్స్ షాపుల నుంచి నెలకు రూ. 2లక్షల వరకు అక్రమ వసూళ్లు అంటూ డైరీలో లెక్కలు రాసి పెట్టాడు. డైరీలో రాసిన వసూళ్ల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.




