ఢిల్లీ హంతకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బానిస... డబ్బు కోసం హత్య !

ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి సంబంధించి వింతైన వివరాలు వెలుగులోకి వచ్చాయి .రాహుల్ (23) 10వ తరగతిలో 73% మరియు 12వ తరగతిలో 90% మార్కులు సాధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఆన్లైన్ గేమ్లకు బానిసయ్యాడని, వాటి కోసం ఇంటి సామాను అమ్మాడని వారు పేర్కొన్నారు. భారీ అప్పుల కారణంగా అతను ఢిల్లీకి వచ్చి, తన మాజీ యజమాని (IRS) కుమార్తెపై అత్యాచారం, హత్యకు పాల్పడి, నగదు, బంగారం దొంగిలించినట్లు సమాచారం..



