నేను బతికే ఉన్నాను బాబోయ్! శవ వస్త్రంతో కలెక్టర్ ఆఫీసుకి..
రెవెన్యూ రికార్డుల్లో తనను చనిపోయినట్లు చూపించడంతో, ఇషాక్ అలీ అనే వ్యక్తి శవంపై కప్పే గుడ్డ కప్పుకుని కలెక్టర్ ఆఫీసుకి వచ్చారు. 2012లోనే ఒక క్లర్క్ ఇతన్ని చనిపోయినట్లు రికార్డు చేసి, తన ఆస్తిని వేరే మహిళ పేరు మీదకు మార్చేశారు. తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ఇషాక్ గత 7 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది చూసి అధికారులు షాక్ అయ్యారు.



