← Back to news

హైదరాబాద్‌లో రౌడీలతో హాస్టల్‌పై ఎటాక్!

By sahani· 21 May 2026· X· Hyderabad

ఏషియన్ హాస్టల్ మేనేజర్స్ దగ్గర రూ. 2 కోట్లు అడ్వాన్స్ తీసుకుని బిల్డింగ్ లీజుకిచ్చిన కాంగ్రెస్ లీడర్ బొంతు రామ్మోహన్, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి తమపై ఎటాక్ చేస్తున్నారని హాస్టల్ ఓనర్స్ చెప్తున్నారు. బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ పోలీసులు ముందే ఒక లేడీ మేనేజర్ ని జుట్టు పట్టుకుని రామ్మోహన్ అత్తగారు కొడుతు గొడవకు దిగారు. బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో వచ్చి హాస్టల్‌లో కూర్చుని బెదిరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి గారే తమను కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.