← Back to news

అడ్డొస్తున్నాడని హత్య చేసి డ్రామా, విచారణలో బిగ్ ట్విస్ట్

By dk yamjala· 1 Jun 2026· కర్నూలు జిల్లా
అడ్డొస్తున్నాడని హత్య చేసి డ్రామా, విచారణలో బిగ్ ట్విస్ట్

AP: ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును మర్డర్ చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం జీ.హోసళ్లి విలేజ్‌లో చోటుచేసుకుంది. గంగమ్మ అనే మహిళ దర్గప్పతో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆమె కుమారుడు నిలదీశాడు. దీంతో లవర్‌తో కలిసి గంగమ్మ కన్నకొడుకు వీరేంద్ర(15)ను కత్తితో పొడిచి చంపి డెడ్‌బాడీని స్మశానవాటికలో పాతిపెట్టింది. తన కుమారుడు కన్పించడంలేదని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకంగా దర్యాప్తు లేటు అవుతుందని హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది. తీవ్ర అనారోగ్యానికి గురైన నిందితురాలు కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.