'కార్లలో తిరగడం కాదు, పాదయాత్ర చేయండి'

హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద గోడలకు పోస్టర్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ రమ్య అనే మహళ ఈ వినూత్న నిరసనకు దిగినట్లు తెలిపింది. CM రేవంత్ రెడ్డి కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు, నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి, చదువుకున్నవారికి జాబ్స్ ఇవ్వాలన్నారు. నాలుగు కార్లు వేసుకుని తిరగడం కాదు, మీ కాళ్లతో పాదయాత్ర చేయండి ప్రజల తిప్పలు అర్థం అవుతుందన్నారు. పల్లెటూర్లో కాదు హైదరాబాద్లో పాదయాత్ర చేయండి. అప్పుడే ఎంత మంది కిరాయికి ఉంటున్నారో మీకు అర్థం అవుతుందని పోస్టర్లో పేర్కొంది.



