పడవ బోల్తా.. తొమ్మిది మంది భక్తులు మృతి!

ఉత్తరప్రదేశ్లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో భక్తులతో వెళ్తున్న పడవ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఢీకొని బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు. లూథియానాకు చెందిన యాత్రికులు కేసీ ఘాట్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సహాయక బృందాలు 17 మందిని రక్షించగా, మరికొందరు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.



