భర్త నల్లగా ఉన్నాడని…

భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య అత్యంత ఘోరానికి పాల్పడింది. ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసి అతనిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. మధ్యప్రదేశ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. పురోహిత్ దేవ్ కృష్ణ ఈ నెల 7న అతని ఇంట్లో శవమై కనిపించాడు. డబ్బుల కోసమే ఎవరో అతనిని చంపారన్నట్టుగా భార్య ప్రియాంక ఇంటిని క్రియేట్ చేసింది. పోలీసులు కూడా మొదట రాబరీలో భాగంగానే హత్య జరిగిందని అనుకున్నారు. కానీ విచారణలో ప్రియాంక తన ప్రియుడు కమలేష్ తో కలిసి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి ప్రొఫషనల్ కిల్లర్స్ తో హత్య చేయించిందని తేలింది చాలా రోజులుగా ప్రియాంక తన భర్తని నువ్వు నల్లగా ఉన్నావంటూ హేళన చేసేదని, నువ్వు నాకు సరిపోవంటూ వేధించేదని కుటుంబ సభ్యులు చెప్పారు.



