← Back to news

త్విషా శర్మ కేసులో కస్టడీలోకి భర్త... లాప్రాక్టీస్ పై వేటు

By DS· 22 May 2026· Hindustantimes· bhopal
 త్విషా శర్మ కేసులో కస్టడీలోకి భర్త... లాప్రాక్టీస్ పై వేటు

త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు, ఆమె భర్త సమర్థ్ సింగ్‌ను భోపాల్ పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని న్యాయవాద వృత్తి ప్రాక్టీస్‌పై తక్షణమే నిషేధం విధించింది. మరోవైపు, ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, మరణానికి గల అసలు కారణాలను తేల్చేందుకు ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) బృందంతో రెండవసారి పోస్ట్‌మార్టం (అటాప్సీ) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.పెళ్లయిన రెండు నెలలకే త్విషా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.