కుక్కల దాడులపై కలెక్టర్లకు నోటీసులు!

వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో జరిగిన దాడులపై Su Motoగా విచారణ చేపట్టింది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారుల నిర్లక్ష్యంపై నివేదిక కోరింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు భంగం కలిగిందని పేర్కొంటూ, జూన్ 2 లోపు పూర్తి వివరాలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించింది.



