ఇన్స్టాగ్రామ్లో వేధింపులు బాలిక ఆత్మహత్య!

హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో పదో తరగతి బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. తోటి విద్యార్థి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైంగికంగా వేధించడంతో మనస్తాపం చెందిన బాలిక ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, సోషల్ మీడియా చాటింగ్ వివరాలను విశ్లేషిస్తున్నారు. పిల్లల ఫోన్ల వాడకంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.



