← Back to news

రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి

By Srikanth Goud Podeti· 28 Aug 2026· Jagitial
రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి

TG: జగిత్యాల జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో తాగునీటి వసతి సరిగా లేకపోవడంతో పాటు రాత్రివేళ పడుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని చెబుతున్నారు. దోమలు, ఈగల బెడదతో పాటు అపరిశుభ్రత కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. రక్త, మూత్ర పరీక్షల కోసం వెళ్లిన సమయంలోనూ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

రోగుల కష్టాలు పట్టవా?.. ఆసుపత్రిలో దుస్థితి

More in Local