← Back to news

అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్

By dk yamjala· 15 Jun 2026· Dishadaily
అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్

TG: రాష్ట్రంలో మొత్తం 1269 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌లో సోమవారం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌లు బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకంతో 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలని పెంచుతున్నామని తెలిపారు.

More in TG