HYD ప్రయాణికులకు గుడ్న్యూస్

TG: కాలుష్య రహిత మహానగరమే లక్ష్యంగా TGSRTC మరో కీలక అడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి మరో 37 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కూకట్పల్లి డిపో పరిధిలో ప్రారంభించిన 23 ఎలక్ట్రిక్ బస్సులు ఐదు వేర్వేరు మార్గాల్లో విజయవంతంగా నడుస్తూ ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ పొందుతుంది. అధికారులు ఈ ఎలక్ట్రిక్ బస్సుల నెట్వర్క్ను నగరం నలువైపులా విస్తరిస్తున్నారు. తాజాగా 37 బస్సులు తోడైతే నగరంలో కాలుష్య నివారణకు మరింత తోడ్పాటు లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



