నల్లబజారుకు యూరియా తరలింపు ఆపాలంటూ ధర్నా

ఖమ్మంజిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట రైతులు మంగళవారం ధర్నా చేశారు.యూరియా రైతులకు అందకుండా నల్లబజారుకు తరలిస్తున్నారని ఆరోపించారు.యాప్ లో ఇతర మండలాలకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు బుక్ చేయగా వారికి pacs అధికారులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తమకు యూరియా ఇచ్చి,యాప్ పద్ధతి ఎత్తి వేయాలని రైతులు డిమాండ్ చేశారు.


