← Back to news

పాపను వదిలి.. గోదావరిలోకి దూకి

By saraswathi rao· 28 Aug 2026· Ambedkar Konaseema
పాపను వదిలి.. గోదావరిలోకి దూకి

AP: పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వశిష్ఠ వంతెన వద్ద తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ కుమార్తెతో కలిసి స్కూటీపై వచ్చారు. అనంతరం చిన్నారిని వాహనంపైనే కూర్చోబెట్టి గోదావరి నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఏడుస్తున్న పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించి, గోదావరిలో దంపతుల కోసం గాలింపు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాపను వదిలి.. గోదావరిలోకి దూకి

More in Local