← Back to news

ఏపీలో బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సేఫ్!

By Jagadish· 15h ago

ఓ చిన్న షార్ట్ సర్క్యుట్. మంటలొచ్చాయ్. బస్సు మొత్తాన్ని కాల్చేసింది. చిన్న మంటొచ్చినప్పుడే డ్రైవర్ చూసి బస్సు ఆపేశారు. ప్యాసింజర్లను దించేశారు. దీంతో అందరూ సేఫ్. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద NH-44 పై 33 మంది ప్యాసింజర్లతో పోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ ట్రాజెడీ జరిగింది. ఫైర్ ఇంజన్లు వచ్చినయ్. కానీ అప్పటికే బస్సు కాలిపోయింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ టైముకు రెస్పాండ్ అవ్వడం అందరినీ కాపాడింది. ఇదే బిగ్ రిలీఫ్.

More in Politics