← Back to news

అస్సాంలో వరదలు.. 75కు చేరిన మృతుల సంఖ్య

By Mahesh· 29 Jul 2026· అస్సాం
అస్సాంలో వరదలు.. 75కు చేరిన మృతుల సంఖ్య

అస్సాంలో వరదల కారణంగా గత 24 గంటల్లో మరో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 75కు చేరింది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది వరదల ప్రభావానికి గురైనట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా సాయాన్ని రూ.9 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 81 సహాయక శిబిరాల్లో 32,477 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, NDRF, SDRFతో పాటు ఇతర బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

More in News