భోపాల్లో పది మంది మిస్సింగ్ కలకలం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో గడిచిన 24 గంటల్లోనే 10 మంది మిస్ అయ్యారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లగానే వీళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. కోలార్, అయోధ్య నగర్, అశోకాగార్డెన్ సహా కొన్ని ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అశోకాగార్డెన్లో క్లాస్కు వెళ్లిన 17ఏళ్ల కుర్రాడు తిరిగి రాలేదు. కొలార్, అయోధ్య నగర్లలో కూడా యువకులు, పెద్దవాళ్లు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల కంప్లైంట్తో పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు.



