లాకప్డెత్ కేసులో సిట్ సంచలనం.. పోలీసులే కొట్టారంటూ!

AP: గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) షాకింగ్ విషయాలు బయటపెట్టింది. A-4 నిందితుడు సురేశ్ రిమాండ్ రిపోర్ట్లో.. పోలీసుల దెబ్బల కారణంగానే సాయికృష్ణ చనిపోయినట్లు సిట్ పేర్కొంది. తరువాత CI నాగరాజు, కానిస్టేబుళ్లు కలిసి డెడ్బాడీని కాల్చేసి ఎవిడెన్స్ను మాయం చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A-4గా ఉన్న సురేశ్ సెప్టెంబర్ 17న SIT ముందు సరెండర్ అయ్యాడు. సాయికృష్ణ డెడ్బాడీని మాయం చేయడంలో అతడి ఇన్వాల్వ్మెంట్పై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.



