దుగ్గిరాల మండలంలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెదపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలను కలుపుతూ నిర్మించిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రూ.2.88 కోట్ల నాబార్డ్ నిధులతో 5 కిలోమీటర్లకు పైగా ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుతో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలకు ప్రయాణం సులభం కానుంది. త్వరలో రహదారిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

