← Back to news

దుగ్గిరాల మండలంలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి

By rajaratnam· 28 Aug 2026
దుగ్గిరాల మండలంలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెదపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలను కలుపుతూ నిర్మించిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రూ.2.88 కోట్ల నాబార్డ్‌ నిధులతో 5 కిలోమీటర్లకు పైగా ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుతో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలకు ప్రయాణం సులభం కానుంది. త్వరలో రహదారిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More in Local