← Back to news

బీజేపీ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి

By RK· 28 Jul 2026
బీజేపీ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత, మాజీ మంత్రి 'నానక్ రామ్ భుర్జీ' అనుమానాస్పద స్థితిలో మరణించారు. లక్నోలోని ఎమ్మెల్యేల నివాస భవనం ఏడో అంతస్తు నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా కొద్దిసేపటికే చనిపోయారు. ప్రమాదవశాత్తు కింద పడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం పంపారు.

More in News