కసిరెడ్డి, వంశీచంద్ రెడ్డికి రాఖీ కట్టిన గీత

TG: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని వారి నివాసాలకు వెళ్లిన గీత ఇరువురినీ కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గీతను అభినందించారు. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

