సఫాయీ కార్మికుల మరణాల సంఖ్య పై కేంద్రం లెక్కలు తప్పు !

దేశవ్యాప్తంగా మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల్లో పని చేస్తూ 332 మంది చనిపోయారని కేంద్రం చెబుతున్న సంఖ్య అవాస్తవమని రియల్ గా 593 మంది చనిపోయారని సఫాయి కరంచారీ ఆందోళన్ వెల్లడించింది. ఈ ఏడాదే ఇంతమంది పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనలో ప్రభుత్వం విఫలమైందని, ప్రధాని మోదీ వైఫల్యాన్ని అంగీకరించాలని డిమాండ్ చేసిందని ది వైర్ కథనం తెలిపింది.



