తన ప్రాణం వదిలి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

AP: తన ప్రాణం వదిలి ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన లీలమ్మ(40) చాలా ఏళ్లకు గర్భవతి అయింది. మూడో నెలలో ఆమెకు గుండె సమస్య ఉందని తెలిసింది. తల్లీబిడ్డల్లో ఒకరినే కాపాడగలమని డాక్టర్లు చెప్పగా, తన ప్రాణం పోయినా సరే బిడ్డను బతికించాలని లీలమ్మ భర్తతో సంతకం చేయించింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. పుట్టిన బాబుని కళ్లారా చూడకుండానే తల్లి కన్నుమూసింది.



