ప్రధాని మోదీ పిలుపుతో ఏపీలో పొదుపు చర్యలు..బాబు, పవన్ కాన్వాయ్ కుదింపు

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీ బాటలో పయనిస్తున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తమ కాన్వాయ్ ని సగానికి సగం తగ్గించారు. సీఎం చంద్రబాబు కాన్వాయ్ 12 వాహనాల నుంచి 4 వాహనాలకు తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేశ్ వాహనాలు 4 నుంచి 2కి తగ్గాయి. ఏపీ మంత్రులు, ఇతర వీఐపీలు కూడా పొదుపు చర్యలు మొదలు పెట్టారు.



