← Back to news

భోగాపురం డేటా సెంటర్ పై మళ్లీ రివ్యూ చేయాలి- శర్మ

By DS· 31 Jul 2026· visakhapatnam
భోగాపురం డేటా సెంటర్ పై మళ్లీ రివ్యూ చేయాలి- శర్మ

దేశంలో ఏర్పాటవుతున్న ప్రతీ AI, డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను సమగ్రంగా పరిశీలించి, పర్యావరణ చట్టాలకు లోబడి ఉన్నాయో లేదో నిర్ధారించుకున్నాకే ముందడుగు వేయాలని కేంద్ర పర్యావరణ శాఖను మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ E.A.S. శర్మ కోరారు. ఇవి భారీగా విద్యుత్, నీటిని వినియోగిస్తూ స్థానిక పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భోగాపురం పరిసరాల్లో రిలయెన్స్ డేటా సెంటర్ కు కేటాయించిన స్థలాలు తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలని, సరైన పర్యావరణ సమీక్ష లేకుండా అనుమతులివ్వడం సరికాదని హెచ్చరించారు.

More in News