చిప్స్ ప్యాకెట్లోని బొమ్మతో బాలుడి మృతి..

కర్ణాటకలోని మైసూరు జిల్లా గౌరిపుర గ్రామంలో ఐదేళ్ల ముకుంద్ మయూర్ అనే బాలుడు చిప్స్ (కుర్కురే) ప్యాకెట్లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బంతిని మింగాడు. ఆ బంతి గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లిన బాలుడిని వైద్యులు కాపాడలేకపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




