సీజేపీ మద్దతుగా నిరసన..కేంద్రం ముందు 5 డిమాండ్లు

TG: దిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్ దగ్గర నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న అందరూ కలిసి కేంద్రం ముందు ఐదు డిమాండ్ల ఉంచారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.కోటి కాన్పన్సేషన్ ప్రకటించాలని, అవినీతితో నిండిపోయిన విద్యావ్యవస్థను మార్చాలని, విద్యార్థులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో శాంతియుత నిరసనలపై బెదిరింపులు ఉండకూడదని డిమాండ్ చేశారు.



