← Back to news

AI టెక్నాలజీతో పన్ను వసూళ్లు: CM రేవంత్‌రెడ్డి

By dk· 8 Aug 2026· హైదరాబాద్
AI టెక్నాలజీతో పన్ను వసూళ్లు: CM రేవంత్‌రెడ్డి

తెలంగాణలో GST ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)ను వినియోగించాలని CM రేవంత్‌రెడ్డి సూచించారు. పన్ను వసూళ్లలో టెక్నాలజీ వినియోగం వ్యాపారులను వేధించేందుకు కాదని, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంతోపాటు సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని స్పష్టంచేశారు. HYDలోని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో GST, ఎక్సైజ్‌ శాఖల్లో సంస్కరణలపై చర్చించారు. జీఎస్టీ అధికారులకు AI ఆధారిత సమాచారంతో పనిని సులభతరం చేసే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు.

More in TG