← Back to news

అత్యాచారం కేసులో కోర్ట్ సంచలన తీర్పు

By DK· 24 Jul 2026· రంగారెడ్డి జిల్లా
అత్యాచారం కేసులో కోర్ట్ సంచలన తీర్పు

TG: హైదరాబాద్‌ LBనగర్‌లో 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు కనుకు మహేశ్‌కు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.13వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2022లో బాలికను బెదిరించి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో పోక్సో కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

More in TG