క్షుద్రపూజల పేరుతో బాలుడి మృతి

AP: క్షుద్ర పూజలకు చిన్నారి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దివ్యాంగ బాలుడు చక్రవర్తి(5)ని నడిపిస్తానని మొబీనా అనే మహిళ కుటుంబసభ్యులను నమ్మించింది. బాలుడిని మొబీనాకు అప్పగించి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. అనంతరం అతని రెండు చేతులను కట్టేసి చిత్రహింసలు పెట్టింది. దెబ్బలకు తాళలేక అతడు స్పాట్లో చనిపోయాడు. అయితే తిరిగి బతికిస్తాని మృతదేహంతో మొబీనా పూజలు చేసింది. చివరికి ఆమె తీరుపై అనుమానం రావడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



