← Back to news

హత్య చేసి డెడ్‌బాడీని గోనె సంచిలో కట్టి..

By DK· 11 Jun 2026· Hmtvlive· హైదరాబాద్‌
హత్య చేసి డెడ్‌బాడీని గోనె సంచిలో కట్టి..

AP: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామపరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య తీవ్ర కలకలం రేపింది. మృతుడు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భూవివాదానికి సంబంధించి రవికుమార్ శతకోడు గ్రామంలోని పొలానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం డెడ్‌బాడీని గోనె సంచిలో పెట్టి బండరాళ్లతో కట్టి నీటిలో పడేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూవివాదమే హత్యకు కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.