← Back to news

‘SIR’ పేరుతో ఫోన్‌ చేస్తే నమ్మొద్దు: సుదర్శన్ రెడ్డి

By dk· 14 Aug 2026
‘SIR’ పేరుతో ఫోన్‌ చేస్తే నమ్మొద్దు: సుదర్శన్ రెడ్డి

TG: ఓటర్లను లక్ష్యంగా చేసుకుని SIR పేరుతో సైబర్‌ మోసాలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం పేరుతో ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు లేదా లింకులు పంపి ఫారం పూర్తి చేయాలని ఎవరైనా కోరితే స్పందించవద్దని సూచించారు. ఫారం నింపిన తర్వాత రూ.5 చెల్లించాలని, నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లాగిన్‌, పాస్‌వర్డ్‌, CVV, ATM PIN వంటి వివరాలను ఇవ్వొద్దని అన్నారు.

More in TG