సాయికృష్ణ కేసు.. పోలీసులకు NHRC నోటీసులు

AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న CI నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. CI నాగరాజుకు అతడి స్నేహితుడు, ఇద్దరు సిబ్బంది సహకరించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. నాగరాజు అరెస్ట్ తరవాత ఆరోపణలు ఎదుర్కొంటున్న నాని, అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. మరోవైపు పోలీసులపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ DGP, విజయవాడ CPలకు నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన CCTV ఫుటేజీని రికవరీ చేయాలని, సాయికృష్ణ అస్థికలను వెలికితీయాలని ఆదేశించింది.



