← Back to news

బస్సులో మంటలు.. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే దగ్ధం

By DK· 13 Jun 2026· Dishadaily· తిరుపతి జిల్లా
బస్సులో మంటలు.. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే దగ్ధం

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీకి చెందిన ఉద్యోగులు విధులు ముగించుకుని సూళ్లూరుపేట వెళ్తుండగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. IMOP కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు తిరుపతి జిల్లా తడ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అలెర్ట్ అయిన ఉద్యోగులు, డ్రైవర్ బస్సులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని అంచనా వేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.