← Back to news

తల్లి కాబోతున్న వేళ విషాదం.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

By dk· 12 Aug 2026· సంగారెడ్డి జిల్లా
తల్లి కాబోతున్న వేళ విషాదం..  ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చేరిన 9నెలల గర్భిణీ అనిత (33) మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. చౌటకూర్ మండలం బద్రిగూడెంకు చెందిన అనితను కుటుంబసభ్యులు ఈ నెల 10న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమెకు ఇవాళ తెల్లవారుజామున ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే సరైన సమయంలో వైద్యం అందకపోవడం, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కూతురు మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

More in TG