← Back to news

రూ.2 కోట్ల ఎర్రచందనం డంప్ గుట్టురట్టు

By DK· 26 Jun 2026· అనంతపురం జిల్లా
రూ.2 కోట్ల ఎర్రచందనం డంప్ గుట్టురట్టు

AP: అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఎర్రచందనం డంప్‌పై చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి జయరాం సహా ముగ్గురిని అరెస్టు చేశారు. జయరాం ఇంటి సమీపంలో నిల్వ చేసిన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలు, అక్రమ రవాణాకు ఉపయోగించిన ఒక కారును సీజ్ చేశారు. శేషాచలం అడవుల్లో కూలీల ద్వారా చెట్లను నరికించి, వాటిని అనంతపురంలో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.