← Back to news

షాబాద్ పోక్సో కేసులో ట్విస్ట్.. CI సస్పెండ్

By DK· 12 Jul 2026
షాబాద్ పోక్సో కేసులో ట్విస్ట్.. CI సస్పెండ్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత బాలిక కుటుంబం తనపై పెట్టిన పోక్సో కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు రాజ్‌కుమార్ రూ.20 లక్షలు ఇచ్చాడని సమాచారం. అంత భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చాడు కాబట్టే పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు పెట్టకుండా స్టేషన్ బెయిల్ వచ్చే బలహీన సెక్షన్లు పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపి ఒక్కొక్క అధికారిపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే SI రమేష్‌ను సస్పెండ్ చేయగా, ఇప్పుడు CI కాంతారెడ్డిని సస్పెండ్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.