షాబాద్ పోక్సో కేసులో ట్విస్ట్.. CI సస్పెండ్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన రాజ్కుమార్ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత బాలిక కుటుంబం తనపై పెట్టిన పోక్సో కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు రాజ్కుమార్ రూ.20 లక్షలు ఇచ్చాడని సమాచారం. అంత భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చాడు కాబట్టే పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు పెట్టకుండా స్టేషన్ బెయిల్ వచ్చే బలహీన సెక్షన్లు పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపి ఒక్కొక్క అధికారిపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే SI రమేష్ను సస్పెండ్ చేయగా, ఇప్పుడు CI కాంతారెడ్డిని సస్పెండ్ చేశారు.



