మూవీ సీన్ను తలపించేలా బంగారం చోరీ

AP: మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నంద్యాల జిల్లా డోన్ హైవేపై శనివారం అర్థరాత్రి భారీ మొత్తంలో బంగారంతో ప్రయాణిస్తున్నాడు. విషయాన్ని ముందే పసిగట్టిన దొంగల ముఠా స్కార్పియో కారులో ఆ ప్రైవేట్ బస్సును ఫాలో చేస్తూ వచ్చింది. బస్సు డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా దగ్గర ఆగడంతో బంగారం ఉన్న బ్యాగ్ అపహరించుకుని స్కార్పియోలో పరారయ్యారు. బస్సు జడ్చర్ల చేరుకున్న తర్వాత మోతిలాల్ బ్యాగ్ కన్పించకపోవడంతో డోన్ PSలో ఫిర్యాదు చేశాడు. 2.750 కిలోల బంగారం చోరీ చేశారని, దానివిలువ రూ.4.50 కోట్లు ఉంటుందని బాధితుడు తెలిపాడు.



