← Back to news

రన్నింగ్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు

By dk· 13 Aug 2026· ఆదిలాబాద్ జిల్లా
రన్నింగ్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు

TG: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంట గ్రామశివారులో జూపిటర్ స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన పడ్వాల్ నిద్యాన్ సింగ్ స్కూటీపై ఇంద్రవెల్లి మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జిరిగింది. గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో స్కూటీ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో వెంటనే వాహనాన్ని ఆపి పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

More in TG