సచివాలయ ఉద్యోగిపై పోక్సో కేసు

AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని భరత్ నగర్ సచివాలయ ఉద్యోగి విజయరామయ్య తోటి మహిళా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమె కుమార్తెపై అకృత్యాలకు పాల్పడ్డాడు. విజయరామయ్యకు స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ పరిచయంతో ఆమె కుమార్తె అయిన 9వ తరగతి చదువుతున్న బాలిక బాత్రూమ్లో ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను చూపిస్తూ బాలికను బ్లాక్మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేశారు.



